తాజ్ మహల్ ను సందర్శించే పర్యాటకులకు యూపీ ప్రభుత్వం కండిషన్

తాజ్ మహల్ ను సందర్శించే పర్యాటకులకు యూపీ ప్రభుత్వం కండిషన్ జారీ చేసింది. మరోసారి ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి పంజా విసురుతుంది. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండడం WHO హెచ్చరికలు జారీచేస్తుంది. ప్రజలంతా అప్రమత్తం అవ్వాల్సిన టైం వచ్చిందని , కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

ఈ తరుణంలో తాజ్ మహల్ ను సందర్శించే పర్యాటకులకు యూపీ ప్రభుత్వం పలు కండిషన్లు జారీ చేసింది. ప్రతిరోజూ వేలాది మంది దేశీయ, వీదేశీ పర్యాటకులు తాజ్ మహల్ సందర్శనకు వస్తుంటారు. ఈ నేపథ్యంలో, కొవిడ్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చిన వారిని మాత్రమే తాజ్ సందర్శనకు అనుమతిస్తామని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. తాజ్ ను చూడటానికి వచ్చేవాళ్లు సందర్శనకు ముందే కొవిడ్ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుందని తెలిపింది. యూపీ డిప్యూటీ సీఎం బ్రిజేష్ పాఠక్ మాట్లాడుతూ, మాస్క్ ధరించి మాత్రమే బయటకు రావాలని ప్రజలను కోరారు. ఇన్ఫెక్షన్ ప్రభావిత దేశాల నుంచి వచ్చేవారిని విమానాశ్రయాల్లోనే టెస్ట్ చేయాలని తెలిపారు.