ట్రక్కును ఢీకొన్న అంబులెన్స్‌.. ఏడుగురు మృతి

ల‌క్నో: ఉత్తర్​ప్రదేశ్​ బరేలీలోని ఫతేగంజ్​లో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అంబులెన్స్​, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. భోజిపుర నుంచి దిల్లీ వెళుతున్న అంబులెన్స్ అదుపు తప్పి.. డివైడర్​ను​ దాటి​ ఓ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు మరణించారు. అంబులెన్స్​ డ్రైవర్​ నిద్రమత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ సంతాపం తెలిపారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/