కరోనా టీకా తీసుకున్న కేంద్ర మంత్రులు
న్యూఢిల్లీ: కరోనా టీకా పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. తాజాగా కేంద్ర మంత్రులు సదానంద గౌడ, నితిన్ గడ్కరీ, నరేంద్ర సింగ్ తోమర్ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. సదానంద గౌడ బెంగళూరులో, నరేంద్ర సింగ్ తోమర్ ఢిల్లీలో, నితిన్ గడ్కరీ, ఆయన భార్య కాంచన్ గడ్కరీ నాగ్పూర్ ఎయిమ్స్లో కరోనా టీకా తీసుకున్నారు. ఈ ఉదయం హిమాచల్ప్రదేశ్లోని ధర్మశాలలో బౌద్ధ మతగురువు దలైలామా కొవిడ్ టీకా వేయించుకున్నారు .
దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 1.90 కోట్ల మంది కోవిడ్19 వ్యాక్సిన్ వేసుకున్నారు. శుక్రవారం ఒక్క రోజు సుమారు 10.34 లక్షల మంది టీకా తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. జనవరి 16వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైన విషయం తెలిసిందే. ఫిబ్రవరి రెండో తేదీ నుంచి ఫ్రంట్లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇస్తున్నారు. కాగా, ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ కరోనా టీకా తీసుకున్న విషయం తెలిసిందే.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/