ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకం ఇంకా పూర్తి కాలేదు : కేంద్రం

న్యూఢిల్లీ : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకం ఇంకా పూర్తి కాలేదని కేంద్రహోంశాఖ వెల్లడించింది. ఏపీ, తెలంగాణ మధ్య కొన్ని ఆస్తుల విభజనపై సయోధ్య కుదరట్లేదని కేంద్ర మంత్రి నిత్యనందరాయ్ తెలిపారు. ఏకాభిప్రాయంతోనే ఆస్తుల విభజన జరుగుతుందన్న మంత్రి…ఇప్పటికే 26 సమావేశాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఏపీ బీజేపీ ఎంపీ జీవీఎల్ అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/