మహిళల భద్రత కోసం సేఫ్‌ సిటీ ప్రాజెక్ట్‌

ట్విట్టర్‌లో వెల్లడించిన కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి

Kishan Reddy
Kishan Reddy

హైదరాబాద్‌: మహిళల భద్రత కోసం దేశంలోని 8 మెట్రో నగరాల్లో సేఫ్‌ సిటీ ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం శ్రీకారం చుడుతోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ఓ మెసేజ్‌ పోస్టు చేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఎంపిక చేసిన మెట్రో నగరాల్లో ఇంటిగ్రేటెడ్‌ స్మార్ట్‌ కంట్రోల్‌ గదులు, ఉమెన్‌ పోలీసు పింక్‌ పెట్రోల్స్‌, ఆశాజ్యోతి కేంద్రా ఏర్పాటు, అభివృద్ధితోపాటు మహిళకు ఉపయుక్తమయ్యే మరిన్ని సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నిర్భయ చట్టం నిధుల ద్వారా ఆయా కేంద్రాల్లో ఈ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేంయడి:https://www.vaartha.com/news/national/