చంద్రబాబుకు కేంద్రంహోంశాఖ అనుమతి

హైదరాబాదు నుంచి విశాఖకు బయలుదేరనున్న చంద్రబాబు

chandrababu naidu
chandrababu naidu

హైదరాబాద్‌: టిడిపి అధినేత చంద్రబాబు విశాఖలోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి విషవాయువులు లీక్ అయిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబీకులను, అస్వస్థతకు గురైన వారిని పరామర్శించేందుకు వైజాగ్ వెళ్లేందుకు అనుమతించాల్సిందిగా కేంద్ర హోంశాఖను కోరారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యటనకు కేంద్ర హోంశాఖ అనుమతించింది. కాసేపట్లో హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి విశాఖకు చంద్రబాబు బయల్దేరనున్నారు. విశాఖ విమానాశ్రయం నుంచి నేరుగా ఎల్జీ పాలిమర్స్ ప్రాంతానికి వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించనున్నారు. అనంతరం బాధితులను పరామర్శిస్తారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/