నేడు తెలుగు రాష్ట్రాల విభ‌జ‌న స‌మ‌స్య‌ల‌పై హోంశాఖ త్రిసభ్య కమిటీ భేటీ

తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కారమయ్యేనా!

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల విభజన సమస్యల పరిష్కారం కోసం త్రిసభ్య కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల విభజన సమన్యలపై ఈరోజు త్రిసభ్య కమిటీ సమావేశం కానుంది. ఈరోజు కమిటీ వర్చువల్ గా సమావేశమై చర్చిస్తుంది. ఈ సమావేశంలో మొత్తం ఐదు అంశాలపై చర్చించాలని అజెండాలో ఖరారు చేశారు. ఏపీ ఆర్థిక సంస్థ విభజన, ఆంధ్రప్రదేశ్ జెన్ కోకు, తెలంగాణ డిస్కంలకు సంబంధించి రావాల్సిన బకాయిలు, పన్నుల్లో వ్యత్యాసాలు, బ్యాంకుల్లో ఉన్న నగదు నిల్వలు, డిపాజిట్ల పంపిణీ పై ఈ స‌మావేశంలో చర్చించనున్నారు. హోంశాఖ సహాయ కార్యదర్శితో పాటు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి చీఫ్ సెక్రటరీలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.

అయితే త్రిసభ్య కమిటీ తొలి భేటీకి ముందే ఓ రచ్చ రాజుకుంది.. 9 అంశాల అజెండాతో ఈనెల 12న రెండు రాష్ట్రాలకు లేఖ రాసింది కేంద్ర హోంశాఖ. అందులో ప్రత్యేకహోదా, లోటు భర్తీ వంటి అంశాలున్నాయి. దీంతో ఒక్కసారిగా ప్రత్యేక హోదాపై ఆశలు చిగురించాయి. కానీ ఆ తర్వాత హోదా, లోటు భర్తీతో పాటు మరో 4 అంశాలను తొలగించి.. ఐదు అంశాలతో కొత్త అజెండా సిద్ధం చేసింది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/