జాతీయ రహదారులకు 25 వేల కిలోమీటర్లకు పెంచుతాం

వచ్చే ఐదేళ్లలో 60 లక్షల ఉద్యోగాల కల్పన

న్యూఢిల్లీ: 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. పేపర్ లెస్ విధానంలో డిజిటల్ మాధ్యమం ద్వారా ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని చదువుతున్నారు. మధ్యతరగతి ప్రజలకు ఈ బడ్జెట్ ఎంతో మేలు చేస్తుందని ఆమె అన్నారు. కేంద్ర బడ్జెట్ ను ఆమె ప్రవేశపెడుతుండటం ఇది నాలుగోసారి.

బడ్జెట్ ప్రసంగంలోని హైలైట్స్:

.కరోనా మహమ్మారి వల్ల ఎదురవుతున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోగలమే విశ్వాసం మనకుంది.
.ప్రపంచంలోనే మన దేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది.
.వచ్చే 25 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ ను రూపొందించాం.
.పేద, మధ్య తరగతి పురోగతి కోసం కృషి చేస్తున్నాం.
.సాంకేతిక ఆధారిత అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నాం.
.జాతీయ రహదారులను 25 వేల కిలో మీటర్లకు పెంచుతాం.
.అత్యాధునిక వసతులతో కొత్త వందే భారత్ రైళ్లు. కవచ్ పథకం కింద 2 వేల కిలోమీటర్లు. 400 కొత్త .జనరేషన్ వందే భారత్ రైళ్లు. 100 పీఎం గతి శక్తి కార్గో టెర్మినల్స్.
.దేశంలో నాలుగు ప్రాంతాల్లో లాజిస్టిక్ పార్కుల ఏర్పాటు.
.పర్వతమాల ప్రాజెక్టు కింద 8 రోప్ వేల నిర్మాణం. 60 కిలోమీటర్ల దూరంలో ఒక్కో రోప్ వే నిర్మాణం.
.డ్రోన్ టెక్నాలజీని పెంచేందుకు డ్రోన్ శక్తి పథకం.
.ఎయిర్ ఇండియా బదిలీ సంపూర్ణంగా పూర్తయింది.
.సేంద్రీయ వ్యవసాయానికి ప్రోత్సాహకాలను అందిస్తాం.
.తృణ ధాన్యాల ఉత్పత్తి, మార్కెటింగ్ కు ప్రత్యేక ప్రోత్సాహకాలు.
.2023ను తృణ ధాన్యాల సంవత్సరంగా ప్రకటిస్తున్నాం.
.వరి, గోధుమ మద్దతు ధర చెల్లింపులకు రూ. 2.7 లక్షల కోట్లు.
.రైతులకు అద్దె ప్రాతిపదికన వ్యవసాయ పనిముట్లు ఇచ్చేందుకు పథకం.
.ప్రాంతీయ భాషల్లో విద్యాభివృద్ధికి టీవీ ఛానెళ్లు.
.డిజిటల్ విద్యను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా డిజిటల్ యూనివర్శిటీ.
.వచ్చే ఐదేళ్లలో 60 లక్షల ఉద్యోగాల కల్పన.
.ఆత్మ నిర్భర్ భారత స్ఫూర్తితో 16 లక్షల ఉద్యోగాలను కల్పించాం.
.ఎయిర్ ఇండియా బదిలీని సంపూర్ణంగా పూర్తి చేశాం.
.రైల్వేలో సరకుల రవాణాకు సరికొత్త పథకం.
.కృష్ణా-గోదావరి, కృష్ణా-పెన్నా ప్రాజెక్టులకు డీపీఆర్ సిద్ధమైంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/