ఇబ్బంది పడే వారు నన్ను ఆన్ ఫాలో అవ్వండి : మంత్రి కేటీఆర్
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీని విమర్శిస్తూ పోస్టింగ్స్ పెట్టిన ప్రతీసారి ఇబ్బంది పడే వారు ట్విట్టర్లో తనను అనుసరించొద్దని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సూచించారు. కేంద్రం, బీజేపీ వైఖరిని, దుష్ర్పచారాన్ని తాను ఎండగడుతూనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇక అచ్చే దిన్ దివాస్ను ఏప్రిల్ ఫూల్స్ డేగా పోల్చుతూ కేటీఆర్ వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు.
కాగా, కేంద్రం నుంచి సరైన సహకారం లేకపోవడంతో.. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని సందర్భానుసారంగా కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రానికి కేటాయించాల్సిన కేటాయింపులతో పాటు ఇతర సమస్యలపై కేంద్రాన్ని కేటీఆర్ నిలదీస్తున్న విషయం విదితమే. కేంద్రం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై కేటీఆర్ ఫైర్ అవుతూనే ఉన్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/