వైఎస్ షర్మిల నిరుద్యోగ దీక్ష ప్రారంభం
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు విశ్వవిద్యాలయం వద్ద దీక్ష
పాలమూరు : వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రతి మంగళవారం నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ దీక్ష చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ రోజు ఆమె మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు విశ్వవిద్యాలయం వద్ద ఆమె నిరుద్యోగ నిరాహార దీక్షకు దిగారు.
ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు ఈ దీక్ష కొనసాగనుంది. అనంతరం ఆమె ప్రసంగిస్తారు. ఆమెకు పలువురు ప్రముఖులు మద్దతు తెలిపారు. ‘నిరుద్యోగ నిరాహారదీక్ష’లో పలువురు విద్యార్థులు, స్థానిక నేతలు కూడా పాల్గొంటున్నారు. తెలంగాణ పూర్తి స్థాయిలో లక్షా 90 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని షర్మిల డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగ సమస్యలు పరిష్కరించే వరకు తాను పోరాడుతూనే ఉంటానని ఆమె చెప్పారు.
తాజా కెరీర్ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/specials/career/