లాక్‌డౌన్‌ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.. కేరళ పోలీస్‌

డ్రోన్‌లతో గుర్తిస్తున్న పోలీసులు

drone camera
drone camera

కేరళ: దేశంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో కేరళ ఒకటి. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ విదించినప్పటికి, ప్రజలు రోడ్లమీద తిరుగుతున్నారు. దీనికి చెక్‌ పెట్టెందుకు కేరళ పోలీసులు ఓ కొత్త ఆయుధాన్ని ప్రయోగించారు. అదే డ్రోన్‌ కెమెరా. వీటిని ఉపయోగించి లాక్‌డౌన్‌ను ఉల్లంఘించే వారిని గుర్తించి, వారిపై చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబందించి ట్విట్టర్‌లో కేరళ పోలీసులు ఓ వీడియోను పోస్టు చేశారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/