స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న మంత్రి కెటిఆర్‌

వైద్యులు, సిబ్బంది సేవలను గుర్తించాలి..కెటిఆర్‌

Minister KTR

సిరిసిల్ల: మంత్రి కెటిఆర్‌ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం సివిల్‌ హాస్పిటల్‌లో వైద్య సిబ్బంది, ప్రజల కోసం లయన్స్‌ ఇంటర్నేషనల్‌ సమకూర్చిన 200 హోం ఐసోలేషన్‌ కిట్లు, శానిటైజర్లు, ఫేస్‌ షీల్డులు, పీపీఈ కిట్లు, 40 గ్రామాలకు బాడీ ఫ్రీజలర్లు సమకూర్చగా.. అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రాణాలు తెగించి వైద్యులు, సిబ్బంది సేవలను గుర్తించి, గౌరవించాలని కెటిఆర్‌ పిలుపునిచ్చారు. సిరిసిల్లలో సేవలందిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు. మధుమేహంతో బాధపడుతూ 80 ఏళ్ల మహిళ కరోనా మహమ్మారి బారినపడి విజయవంతంగా ఇక్కడ దవాఖానలో కోలుకుందన్నారు.

సివిల్‌ హాస్పిటల్‌ డాక్టర్లు, వైద్య సిబ్బంది సేవలతోనే కరోనా నుంచి బయపడినట్లు చెప్పిందని గుర్తు చేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 72శాతం మంది రికవరి కాగా, ఇండ్లకు వెళ్లారని, మిగతా వారంతా చికిత్స పొందుతున్నారన్నారు. వైద్యులు, సిబ్బంది గొప్పగా పని చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజలకు తాను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నానని, ప్రభుత్వ వైద్యరంగంలో డాక్టర్లు, సిబ్బంది అందిస్తున్న సేవలను గుర్తించాలని సూచించారు. ఎన్ని సమస్యలు, ఇబ్బందులు ఉన్నా ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కృషి చేస్తున్నారన్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/