రైతులకు ఏపి ప్రభుత్వం శుభవార్త

పంట పొలాల్లో ఉచితంగా బోర్లు

jagan mohan reddy
jagan mohan reddy

అమరావతి: ఏపి ప్రభుత్వం రైతుల శుభవార్త తెలిపింది. పంట పొలాల్లో ఉచితంగా బోర్లు వేయాలని నిర్ణయించింది. 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు ఉచిత బోర్లు వేయిస్తామని వెల్లడించింది. అర్హత కలిగిన రైతులు తమ పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులతో గ్రామసచివాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఈ పథకం కింద లబ్ది పొందాలనుకునేవారికి కొన్ని విధివిధానాలు, అర్హతలు రూపొందించారు. రైతుకు కనీసం రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉండాలి. ఒకవేళ తానొక్కడికే అంత భూమి లేకపోతే, తన పొలం పక్కనున్న రైతులతో కలిసి ఓ గ్రూపుగా ఏర్పడి ఉచిత బోరుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అప్పటికే బోర్లు ఉన్న పొలాలను ఈ ఉచిత పథకం నుంచి మినహాయించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/