బ్రిటన్లో 160కి చేరిన ఒమిక్రాన్ కేసులు
uk-confirmed-160-omicron-cases
లండన్: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని వణికిస్తున్నది. ఇప్పటివరకు 30కిపైగా దేశాల్లో మహమ్మారి కేసులు నమోదయ్యాయి. దక్షిణాఫ్రికాలో మొదలైన ఈ వేరియంట్ ఇప్పుడు బ్రిటన్లో కలకలం సృష్టిస్తున్నది. దేశంలో ఇప్పటివరకు 160 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా నైజీరియా, దక్షిణాఫ్రికా నుంచి వచ్చినవారిలోనే ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణికులపై నిషేదం విధించింది. బ్రిటన్కు వచ్చేవారు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్ష తప్పనిసరిచేసింది. నైజీరియా నుంచి వచ్చినవారి హోటళ్లకు తరలిస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి సాజిద్ జావిద్ తెలిపారు.
ఒమిక్రాన్ వ్యాప్తిని నిలువరించడాని అంతర్జాతీయ ప్రయాణికులను క్వారంటైన్లో ఉంచుతామని, ప్రయాణానికి ముందు కరోనా పరీక్షలు తప్పనిసరి చేస్తున్నామని ప్రకటించారు. నైజీరియా నుంచి వచ్చినవారు హోటళ్లలో క్వారంటైన్లో ఉండాల్సిందేనని చెప్పారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/