రవీంద్ర భారతిలో ఘనంగా ఉగాది వేడుకలు
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో ఉగాది వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు పంచాంగాన్నిఆవిష్కరించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుపరిపాలన అందింస్తుందని… అన్ని పనులు ఈ సంవత్సరం పూర్తవుతాయని వివరించారు.తెలంగాణ రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది… అన్ని ప్రాజెక్టులు పూర్తిగా నిండుతాయి. జలవృద్ధి అధికంగా ఉంటుందని చెప్పారు.ఈ సంవత్సరం పాడిపంటలు అద్భుతంగా ఉంటాయని… విద్యావకాశాలు మెరుగు పడుతాయని పంచాంగం చెప్పారు.