దమ్ముంటే నా ప్రభుత్వాన్ని కూల్చండి..ఉద్ధవ్

బిజెపితో మాకు వచ్చిన నష్టమేమీ లేదు..ఉద్ధవ్ ఠాక్రే

uddhav thackeray
uddhav thackeray

ముంబయి: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే శివసేన అధికారిక పత్రిక ‘సామ్నా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వం కూలిపోవడం, రాజస్థాన్‌లో అస్థిరతపై ఆయన స్పందిస్తూ బిజెపితో తన ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదని తేల్చి చెప్పారు. తమ ప్రభుత్వం పూర్తి ఐదేళ్లు అధికంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాజకీయ పరిణామాలపై మాట్లాడుతూ.. బిజెపి కి దమ్ముంటే తన ప్రభుత్వాన్ని కూల్చాలని సవాలు విసిరారు. చైనాతో విభేదాలపై స్పందిస్తూ అంతర్జాతీయ సంబంధాల విషయంలో కేంద్రానికి స్పష్టమైన వైఖరి ఉండాలని అన్నారు. ప్రస్తుతం మనం చైనాను వ్యతిరేకిస్తున్నప్పటికీ భవిష్యత్తులో అదే మనకు మిత్ర దేశంగా మారే అవకాశాలను కొట్టిపడేయలేమన్నారు. కాబట్టి అంతర్జాతీయ సంబంధాల విషయంలో మరింత కష్టపడాల్సిన అవసరం ఉందని ఉద్ధవ్ అభిప్రాయపడ్డారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/