భారత విమానాలపై యూఏఈ నిషేధం పొడిగింపు

న్యూఢిల్లీ : భారత విమానాల రాకపోకలపై నిషేధాన్ని పొడిగిస్తూ యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) ఇవాళ నిర్ణయం తీసుకుంది. నిషేధాన్ని వచ్చే నెల 2వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఆ దేశ జాతీయ విమానాయాన సంస్థ ఎతిహాద్‌ ఎయిర్‌ వేస్‌ తెలిపింది. పరిస్థితులకు అనుగుణంగా విమానాల రాకపోకల పునరుద్ధరణపై నిర్ణయం తీసుకుంటామని ఈ సంస్థ అధికారులు పేర్కొన్నారు.

కాగా, భారత్‌లో కరోనా డెల్టా వేరియంట్‌ ఉధృతి కారణంగా గత నెల కెనడా ప్రభుత్వం సైతం భారత ప్రయాణికుల విమానాల రాకపోకలపై మరో నెలపాటు నిషేధం పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/