మరో ఇద్దరు ఇటలీ పర్యాటకులకు కరోనా
పంజాబ్లో ఇద్దరు ఇటలీ పర్యాటకులకు కరోనా వైరస్ పాజిటివ్
అమృత్సర్: పంజాబ్లోని అమృత్సర్ నగరలో ఈరోజు మరో రెండు కరోనా వైరస్ (కొవిడ్-19) పాజిటివ్ కేసలు నమోదైనవి ఇటలీ దేశం నుంచి వచ్చిన ఇద్దరు పర్యాటకులకు కరోనా వైరస్ లక్షణాలు ఉండటంతో వారిని అమృత్సర్లోని గురునానక్ దేవ్ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక పరీక్షల్లో ఇటలీవాసులకు కరోనా వైరస్ ఉందని తేలడంతో వారి రక్తనమూనాలను సేకరించి తుది పరీక్ష కోసం పూణేలోని జాతీయ వైరాలజీ సంస్థకు పంపించారు. ఇద్దరు ఇటలీవాసులకు కరోనా వైరస్ ఉందని పూణే వైరాలజీ సంస్థ తేల్చిచెప్పిందని గురునానక్ దేవ్ ఆసుపత్రి సివిల్ సర్జన్ డాక్టర్ ప్రభదీప్ కౌర్ జోహోల్ చెప్పారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/