జమ్మూ కశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
అవంతిపొర వద్ద ఉగ్రవాద కదలికలు
శ్రీనగర్ః జమ్మూ కశ్మీర్ పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు టెర్రరిస్టులను సైన్యం హతమార్చింది. అవంతిపొర ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలకు సంబంధించిన సమాచారంతో భారీగా భద్రతా బలగాలను తరలించారు. జవాన్లు గాలింపు చర్యలు చేపట్టగా, ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీటుగా స్పందించిన భద్రతా బలగాలు ఎదురుకాల్పులకు దిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించగా, వారి నుంచి అమెరికా తయారీ తుపాకీ, ఒక పిస్టల్, మరికొన్ని ఆయుధాలు, మందుగుండు స్వాధీనం చేసుకున్నారు.
కాగా, మరణించిన వారిలో ఒకరిని కైజర్ కోకా అని గుర్తించారు. అతడు జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన కరడుగట్టిన ఉగ్రవాది అని పోలీసులు తెలిపారు. మరో ఉగ్రవాదిని గుర్తించాల్సి ఉంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telangana/