ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
హిజ్బుల్ టాప్ కమాండర్ను చుట్టుముట్టిన సైన్యం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ పుల్వామాలో శార్షాలి గ్రామంలో ఉగ్రవాదులున్నారనే సమాచారంతో భద్రతా బలగాలు కూంబింగ్ ప్రారంభించాయి. ఇంతలోనే సైన్యంపై ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. ఈక్రమంలో ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనా స్థలం నుంచి సైన్యం పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రిని, ఆయుధాలను స్వాధీనం చేసుకుంది. ఆపరేషన్ కొనసాగుతోంది.
మరోవైపు, ఇదే జిల్లాలోని బీగ్పొరాలో హిజ్బుల్ ముజాహిదీన్ టాప్ కమాండర్ రియాజ్ నైకూను భద్రతా దళాలు చుట్టుముట్టాయి. ప్రస్తుతం ఇక్కడ హోరాహోరీగా కాల్పులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. కాగా, జమ్మూకశ్మీర్ పోలీసులు, భద్రతా దళాలు జిల్లాలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో సంయుక్త ఆపరేషన్ చేపట్టి ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నాయి. ఏ ప్లస్ ప్లస్ కేటగిరికి చెందిన రియాజ్పై 12 లక్షల రూపాయల రివార్డ్ కూడా ఉంది. ఆరంభంలో ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న రియాజ్ 2012లో 33 ఏళ్ల వయసులో హిజ్బుల్ బాధ్యతలు స్వీకరించాడు. 2017లో జాకిర్ మూసా వేరుపడ్డాక కీలకంగా మారాడు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/