ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

Encounter
Encounter

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అవంతిపొరా ప్రాంతంలోని సాంబూరాలో ఉగ్రవాదులు ఉన్నారని అందిన సమాచారం మేరకు భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని గాలింపు చేపట్టాయి. భద్రతాబలగాల రాకను గమనించిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారని ఓ పోలీస్‌ అధికారి చెప్పారు. భద్రతాబలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారని, వారు ఏ గ్రూప్‌కు చెందిన వారన్న సంగతి ఇంకా తెలియరాలేదన్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/