కశ్మీర్లో ఎన్కౌంటర్ ..ఇద్దరు తీవ్రవాదుల హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని పుల్వామా జిల్లా బాంద్జూ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున ఉగ్రవాదులకు, భద్రతాబలగాలకు మధ్య ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున 5.00 గంటల నుంచి కొనసాగుతున్న ఎన్కౌంటర్లో ఇప్పటివరకు ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. బాంద్జూలో ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారం మేరకు జమ్ముకశ్మీర్ పోలీసులు, భద్రతాబలగాలు సంయుక్తంగా గాలింపు చేపట్టాయి. ఉగ్రవాదులు దాగి ఉన్న ప్రదేశాన్ని చుట్టుముట్టి లొంగిపోవాలని హెచ్చరించగా.. అటువైపు నుంచి కాల్పులు మొదలయ్యాయి. దీంతో భద్రతా బలగాలు కూడా ఎదురుకాల్పులు జరిపాయి.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/