తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్ ఇద్దరు మావోలు మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు చోటుచేసుకోగా… ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్‌ బలగాలు కూంబింగ్‌ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో చర్ల మండలం పుట్టపాడు వద్ద మావోయిస్టులు పోలీసులకు తారసపడ్డారు.

దీంతో మావోయిస్టులు గ్రేహౌండ్స్‌ బృందంపై కాల్పులు జరిపారు. ప్రతిగా జరిపిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. మృతుల్లో ఒకరు ఎల్‌ఓఎస్‌ కమాండర్‌ రాజేష్‌ కాగా మరొకరు సీఎన్‌ఎం కమాండర్‌ నందా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో లభించిన ఎస్‌ఎల్‌ఆర్‌, వస్తు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.