కడప జిల్లాలో కాల్పులు.. ఇద్దరి మృతి

ఆస్తి వివాదాలే కారణమని ప్రాథమిక నిర్థారణ

క‌డ‌ప: కడప జిల్లా పులివెందుల మండలం నల్లపురెడ్డి పల్లెలో కాల్పులు క‌ల‌కలం సృష్టించాయి. ఆస్తి తగాదాల నేపథ్యంలో ఒక వ్యక్తి మరో వ్యక్తిని కాల్చి చంపి ఆపై తాను కూడా అదే తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రసాద్‌రెడ్డి లైసెన్స్ కలిగిన తన తుపాకితో తన బంధువు పార్థసారథిరెడ్డిని కాల్చి చంపాడు. అనంతరం అదే తుపాకితో ప్రసాద్‌రెడ్డి తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆస్తి వివాదాలే ఇద్దరి మధ్య గొడవలకు కారణమని అనుమానిస్తున్నారు. ఇరు కుటుంబాల వారూ వైస్సార్సీపీకి చెందిన వారేనని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/