కాబూల్లో పేలుళ్లు..ఇద్దరు మృతి
కాబూల్: ఈరోజు ఉదయం 6.45 గంటలకు అఫ్గనిస్థాన్ రాజధాని నగరం కాబూల్లో జంట పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. పోలీసు వాహనంలో మాగ్నిటిక్ బాంబు అమర్చి పేల్చడం ద్వారా ఓ కానిస్టేబుల్ చనిపోయాడు. మరోక ఘటనలో ఉదయం 8.07 గంటలకు విద్యాశాఖ మంత్రి కారు లక్ష్యంగా చేసుకుని పేలుడుకు పాల్పడ్డ ఘటనలో మరో వ్యక్తి మృతిచెందాడు. మంగళవారం సైతం దేశం 101వ స్వాతంత్ర్య వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సమయంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. వాజీర్ అక్బర్ ఖాన్ దౌత్య ప్రాంతం, ఇతర పరిసరాల్లో 14 రాకెట్లతో దాడికి పాల్పడి 10 మందిని తీవ్రంగా గాయపరిచారు. వీరిలో నలుగురు పిల్లలు, ఒక మహిళ ఉన్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/