నైజీరియాలో ఇద్దరు భారతీయుల కిడ్నాప్
ఫార్మా కంపెనీలో పనిచేస్తున్న భారతీయులు
లాగోస్: నైజీరియాలోని ఇద్దరు భారతీయులను ముష్కరులు అపహరించారు. విధులు ముగించుకుని బయటకు వస్తున్న వీరిని సాయుధ ముఠాలు కిడ్నాప్ చేసి తీసుకెళ్లాయి. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దుండగుల కోసం వేట ప్రారంభించారు.
నైజీరియాలోని ఫార్మా కంపెనీల్లో వందలాదిమంది భారతీయులు పనిచేస్తున్నారు. వీరిని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేయడం ఇటీవల బాగా పెరిగింది. అయితే, కిడ్నాప్ చేసి తమతో తీసుకెళ్లిన వారికి ఎటువంటి అపాయం తలపెట్టకుండా డబ్బులు అందగానే వారిని సురక్షితంగా వదిలిపెడుతుండడం గమనార్హం. తాజా కిడ్నాప్ నేపథ్యంలో దేశంలోని విదేశీయులందరూ అప్రమత్తంగా ఉండాలని నైజీరియా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/