ఇద్దరు భారతీయ నర్సులకు ‘కరోనా’
మనామా: కరోనా మహమ్మారి బారిన బహ్రెయిన్లో మరో ఇద్దరు భారతీయ నర్సులు పడ్డారు. కేరళ రాష్ట్రం తిరువనంతపురంలోని కసారగాడ్కు చెందిన ఇద్దరు నర్సులు బహ్రెయిన్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్న వారిద్దరిని వైద్యపరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్లు తేలింది. దీంతో ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరు నర్సులు కోలుకుంటున్నట్లు అక్కడి వైద్యులు తెలిపారు. ఈ ఇద్దరితో కలిపి బహ్రెయిన్లో కరోనా బారినపడ్డ భారతీయ నర్సుల సంఖ్య నాలుగుకు చేరింది. కాగా, బహ్రెయిన్లో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 195కి చేరాయి.
తాజా వీడియోస్ కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/videos/