దేశానికి ఇద్దరు జాతిపితలు: అమృత ఫడ్నవీస్
గాంధీ దేశానికి, ఆధునిక భారత్కు మోడీ జాతిపితలు..
న్యూఢిల్లీః ప్రధానమంత్రి నరేంద్రమోడీని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ ఆకాశానికెత్తేశారు. మోడీని జాతిపితగా కీర్తించారు. దేశానికి ఇద్దరు జాతిపితలు ఉన్నారని, ఒకరు మహాత్మాగాంధీ అయితే, ఇంకొకరు ప్రధానమంత్రి నరేంద్రమోడీ అని చెప్పుకొచ్చారు. జన్మదినం సందర్భంగా మోడీకి గతంలో శుభాకాంక్షలు చెబుతూ ఆయనను జాతిపితగా అమృత కీర్తించారు.
ఇటీవల ఓ మాక్ కోర్టు ఇంటర్వ్యూకు హాజరైన అమృతను.. మోడీ జాతిపిత అయితే, మరి గాంధీ ఎవరు? అని నిర్వాహకుడు ప్రశ్నించారు. స్పందించిన అమృత గాంధీ దేశానికి జాతిపిత అయితే, ఆధునిక భారతదేశానికి మోడీ జాతిపిత. మొత్తంగా దేశానికి ఇద్దరు జాతిపితలు అని అమృత సమాధానం ఇచ్చారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telangana/