ముంబయిలో భారీ అగ్ని ప్రమాదం..ఇద్దరు మృతి

18వ అంతస్తులోని ఒక ఫ్లాట్ లో అగ్నికీలలు

ముంబయి: ముంబయిలోని బహుళ అంతస్తుల అపార్ట్ మెంట్ లో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నానా చౌక్ ప్రాంతంలో భాటియా హాస్పిటల్ సమీపంలోని కమలా బిల్డింగ్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 7.30 గంటల సమయంలో 18వ అంతస్తులోని ఒక ఫ్లాట్ లో అగ్ని మొదలైంది. ఇద్దరు మరణించినట్లు ప్రాథమిక సమాచారం.

13 అగ్నిమాపక శకటాలు చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నాలు ఆరంభించాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. లెవల్-3 ప్రమాదంగా దీన్ని గుర్తించారు. ఐదు అంబులెన్స్ లు కూడా చేరుకున్నాయి. ఇద్దరు మరణించారని, పలువురికి గాయాలైనట్టు తెలుస్తోంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/