ఒడిశాలో నేడు రెండు పాజిటివ్‌ కేసులు

Corona updates -AP
Corona virus

ఒడిశా: ఒడిశాలో కరోనా వైరస్‌ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఈరోజు మరో రెండు కరోనా కేసులు నమోదైనట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 179 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తిచెందకుండా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కాగా కరోనా కట్టడి చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మే 17వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగించిన విషయం తెలిసిందే.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/