జనసేన పార్టీ లోకి వైస్సార్సీపీ కీలక నేత ..?

ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. గతంలో సొంతపార్టీ ని కాదని వైస్సార్సీపీ లో చేరిన నేతలంతా ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. కొంతమంది సొంత గూటికి చేరుతుంటే..మరికొంతమంది జనసేన పార్టీ వైపు చూస్తున్నారు. రీసెంట్ గా బిజెపి కీలక నేత కన్నా లక్ష్మి నారాయణ టీడీపీ లో చేరగా.. మదనపల్లి మాజీ ఎమ్మెల్యే షాజహాన్ సైతం టీడీపీ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో అధికార పార్టీ వైస్సార్సీపీ కీలక నేత , కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు నేడు ఆ పార్టీకి రాజీనామా చేసారు.

త్వరలోనే ఈయన జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కొవ్వూరులో తన అభిమానులు, అనుచరులతో సమావేశమైన రామారావు, వైస్సార్సీపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు. పార్టీలో సరైన గుర్తింపు లేకపోవడంతో, తమను నమ్ముకున్న అనుచరులకు సరైన న్యాయం చేయలేకపోతున్నాను.. తీవ్ర మనస్థాపంతోనే వైస్సార్సీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు.

2009లో కొవ్వూరు నియోజకవర్గం నుంచి టీడీపీ నుండి గెలిచారు. అయితే, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. కానీ, పార్టీ అభ్యర్థి కేఎస్ జవహర్కు మద్దతుగా ప్రచారం చేసిన ఆయన టీడీపీ అభ్యర్థి విజయంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. తర్వాత 2019 ఎన్నికల్లోనైనా టీడీపీ నుంచి టికెట్ వస్తుందని ఆశించినా టికెట్ మాత్రం రాలేదు. దీంతో.. టీడీపీకి గుడ్ బై చెప్పి వైస్సార్సీపీ లో చేరారు. కొవ్వూరు నుంచి పోటీ చేసిన వైస్సార్సీపీ అభ్యర్థి తానేటి వనితకు మద్దతుగా ప్రచారం చేసి ఆమె విజయం కోసం కృషి చేశారు. ఇక, ఇప్పుడు వైస్సార్సీపీ కి రాజీనామా చేసారు.