టర్కీలో ఓ బొగ్గుగనిలో భారీ పేలుడు..25 మంది మృతి

టర్కీలో ఓ బొగ్గుగనిలో భారీ పేలుడు సంభవించడం తో 25 మంది మృతి చెందగా , 110 కి పైగా గాయపడ్డారు. శుక్రవారం సాయంత్రం మీథేన్‌ వాయువు వల్ల ఈ పేలుడు సంభవించింది. ఈ పేలుడు లో 25 మంది మృతిచెందగా, 110 మందికిపైగా గాయపడ్డారని , మరో 50 మంది గనిలో చిక్కుకు పోయారని అధికారులు తెలిపారు. 11 మంది క్షేమంగా బయటపడ్డారని వారిని హాస్పటల్ కు తరలించామని చెప్పుకొచ్చారు. ఇక గాయపడినవారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉందని టర్కీ ఆరోగ్యశాఖ మంత్రి ఫహ్రెట్టీన్‌ కోకా ట్వీట్‌ చేశారు.