20న శ్రీవారి రూ. 300 దర్శన టికెట్ల విడుదల

20న ఉదయం 9 గంటల నుంచి అందుబాటులోకి
టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌తోపాటు యాప్‌లోనూ అందుబాటులో టికెట్లు

తిరుమల : తిరుమలలో ఈ నెల 20న ఆగస్టు నెల శ్రీవారికి సంబంధించిన రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్లను విడుదల చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్ణయించింది. 20న ఉదయం 9 గంటల నుంచి టీటీడీ అధికారిక వెబ్‌సైట్ తిరుపతిబాలాజీ.ఏపీ.జీవోవీ.ఇన్ (tirupatibalaji.ap.gov.in) తోపాటు ‘గోవిందా’ యాప్‌లోనూ టికెట్లు అందుబాటులో ఉంటాయని టీటీడీ తెలిపింది. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం 5 వేల టికెట్లను మాత్రమే విడుదల చేస్తుండగా మున్ముందు మరిన్ని టికెట్లు అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/