ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతి

తితిదే నిర్ణయం

Tirumala: శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించాలని తితిదే నిర్ణయించింది. ఏప్రిల్ 14 నుంచి ఆర్జిత సేవలకు అనుమతించనుంది. ఏడాది కాలానికి సంబంధించి 28,258 సుప్రభాత సేవ టిక్కెట్లు, 6,468 తోమాల సేవా టిక్కెట్లు, 6,808 అర్చన సేవా టిక్కెట్లు, 2,124 అష్టదళపాదపద్మారాధన సేవ టిక్కెట్లు, 2,136 తిరుప్పావడ సేవా టిక్కెట్లు, 5464 అభిషేకం సేవా టిక్కెట్లను భక్తులు పొందారు. ఆగమపండితులు, ఆలయ జియ్యంగార్లు సలహా మేరకు ఇకపై ఏడాదికి ఒక్కసారే వసంతోత్సవం, సహస్రకళషాభిషేకం, విశేషసేవ పూజలు నిర్వహించాలని తితిదే నిర్ణయించింది.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/