టీటీడీ పాలకమండలి సభ్యుల జాబితా విడుదల
తిరుమల: టీటీడీ పాలకమండలి జాబితాను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 25 మందితో టీటీడీ పాలక మండలి జాబితాను ప్రభుత్వం ప్రకటించింది. పాలక మండలి సభ్యులుగా ఏపీ నుంచి పొలకల అశోక్ కుమార్, మల్లాడి కృష్ణారావు, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ఎమ్మెల్యేలు కాటసాని, గోర్ల బాబూరావు, మధుసూదన్ యాదవ్ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి జూపల్లి రామేశ్వరరావు, లక్ష్మీనారాయణ, పార్దసారథి రెడ్డి, మూరంశెట్టి రాములు, కల్వకుర్తి విద్యా సాగర్లకు ఛాన్స్ దక్కింది.
మరోవైపు తమిళనాడు నుంచి శ్రీనివాసన్, ఎమ్మెల్యే నందకుమార్, కన్నయ్యలకు ఛాన్స్ దక్కగా .. కర్ణాటక నుంచి శశిధర్, ఎమ్యెల్యే విశ్వనాధ్ రెడ్డి ఛాన్స్ కొట్టేశారు. అలాగే మహారాష్ట్ర నుంచి శివసేన కార్యదర్శి మిలింద్కు ఏపీ సర్కారు చోటు కల్పించింది. టీటీడీ పాలకమండలి జాబితాలో ఏపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు ఎంపిక కావడం విశేషం.
టీటీడీ పాలక మండలి జాబితా
ఏపీ నుంచి పోకల అశోక్ కుమార్, మల్లాడి క్రిష్ణారావు, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, గొర్ల బాబూరావు
తెలంగాణ నుంచి జూపల్లి రామేశ్వరావు, రాజే శర్మ, పార్థసారధి రెడ్డి, కల్వకుర్తి విద్యాసాగర్
తమిళనాడు నుంచి శ్రీనివాసన్, ఎమ్మెల్యే నందకుమార్, కన్నయ్య
కర్ణాటక నుంచి ఎమ్మెల్యే విశ్వనాధ్రెడ్డి, శశిధర్
మహారాష్ట్ర నుంచి శివసేనా కార్యదర్శి మిలింద్కు అవకాశం
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/