శ్రీశైలంకు స్పెషల్ బస్సులు
హైదరాబాద్: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా టిఎస్ఆర్టిసి హైదరాబాద్ నుండి శ్రీశైలం వరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికుల సౌకర్యార్థం ఎంజిబిఎస్, లింగంపల్లి బస్టాండు ప్రాంతాలతో పాటు ప్రయాణికుల రద్దీ మేరకు ఇతర ప్రాంతాల నుండి బస్సులు నడుపుతారని తెలిపా రు. అలాగే బస్సు ఛార్జీలను కూడా నిర్ణయించారు. లింగంపల్లి నుండి శ్రీశైలం వరకు రూ.530, ఎంజిబిఎస్ నుండి శ్రీశైలం వరకు రూ.500లు ఖరారు చేశారు. పూర్తి వివరాలకు మియాపూర్ డిపో మేనేజర్ సెల్ నెంబర్ 9959226153. మెహిదిపట్నం డిపో మేనేజర్ సెల్ నెంబర్ 9959226133లను సంప్రదించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అటు మహాశివ రాత్రి సందర్భంగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి డా.వి.శ్రీనివాస్ గౌడ్ అదేశాల మేరకు రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్-వేములవాడ ప్రత్యేక బస్సు సర్వీసుల టూర్ ప్యాకేజి విడుదల చేశారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/