సజ్జనార్ సైతం సుఖీభవ సుఖీభవ అనేసాడే..
ఈ మధ్య ఎక్కడ విన్న ‘అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ సుఖీభవ..’ అనే పదం బాగా వినిపిస్తుంది. ఓ వాణిజ్య ప్రకటన కోసం వాడిన ఈ డైలాగ్..ఇప్పుడు అనేక వీడియోల కోసం ఉపయోగిస్తున్నారు. తాజాగా టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సైతం..ఆర్టీసీ ఆదాయాన్ని పెంచేందుకు సరికొత్త ఆలోచన చేసారు.
ఓ వ్యక్తి రోడ్డు మీద పిల్లతో కలిసి మ్యూజిక్కు స్టెప్పులేస్తుంటాడు. ఇంతలో మరో వ్యక్తి అక్కడికి లగేజ్తో వస్తాడు. అతడు రోడ్డు మీద ఉన్న వ్యక్తితో తాను జీప్లో ఊరికి వెళ్తున్నట్టుగా చెప్తాడు. అప్పుడు వెంటనే ఆ వ్యక్తి.. ‘పక్కనే ఆర్టీసీ బస్సు ఉంది.. క్షేమంగా వెళ్లొచ్చు.. డబ్బులు ఎక్కువ తీసుకోరు గానీ.. సుఖీభవ, సుఖీభవ’అంటూ పిల్లతో కలిసి డ్యాన్స్ చేయడం మొదలుపెడతాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతుంది. సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రయాణికులను ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేలా చేసేందుకు వివిధ చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే.
#ayyovadama #sukibava #sukibava అయ్యయ్యో వద్దమ్మా కానీ.. సుఖీభవ సుఖీభవ నమ్మకానికి భరోసా మన @TSRTCHQ #RTC బస్సులలో ప్రయాణం సురక్షితం, సుఖమయం, మరియు శుభప్రదం. #Dussehra #Dussehrafestival #SupportRTCJourney #Busjourney #TravelinRTCbus #TSRTC #OurRTC #OurPride @Govardhan_MLA pic.twitter.com/VfaxkxPVMH— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) October 12, 2021