అల్లు అర్జున్ కు బిగ్ షాక్ ఇచ్చిన సజ్జనార్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చిక్కుల్లో పడ్డాడు. తాజాగా ఈయన రాపిడో బైక్ ట్యాక్సీ యాడ్ లో నటించారు. ఈ యాడ్ లో అల్లు అర్జున్ ఓ హోటల్లో దోసెలు వేస్తుంటారు. ఓ వ్యక్తి రాగా, అతడికి బైక్ ట్యాక్సీలో ప్రయాణం సుఖంగా ఉంటుందని, ఆర్టీసీ సిటీ బస్సులో ఎక్కితే కుర్మా వేసి ఖీమా కొట్టి మసాలా దోసెలా చేసేస్తారని అంటూ.. ర్యాపిడో బైక్ ట్యాక్సీ ఎక్కాలని అతడిని ప్రోత్సహిస్తారు.

కాగా ఈ యాడ్ పై తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆర్టీసీ బస్సులను, సంస్థ సేవలను కించపరిచేలా యాడ్ ఉందని, ఇలాంటి ప్రచారాన్ని ఖండిస్తున్నామని అన్నారు. నటులు, ఇతర సెలబ్రిటీలు ఇలాంటి వాణిజ్య ప్రకటనల్లో నటించేటప్పుడు ఆలోచించుకోవాలని సూచించారు. ర్యాపిడో యాడ్ లో నటించిన యాక్టర్ కు, సదరు బైక్ ట్యాక్సీ సంస్థకు నోటీసులు పంపించనున్నామని తెలిపారు.

ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో పుష్ప మూవీ చేస్తున్నాడు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ మొదటి భాగం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17 న రిలీజ్ కాబోతుంది.

https://youtube.com/watch?v=Byd7Fa0yyOs