కొత్త ఏసీ స్లీపర్‌‌‌‌ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తున్న TSRTC

ప్రయాణికులకు గుడ్ న్యూస్..TSRTC కొత్త ఏసీ స్లీపర్‌‌‌‌ బస్సులను అందుబాటులోకి తీసుకరాబోతుంది. ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా TSRTC మొదటిసారి 16 AC స్లీపర్ బస్సులను ఈరోజు ప్రారంభించనుంది. ఈ బస్సుల్లో ప్రయాణికులకు ఉచిత వైఫై సౌకర్యాన్ని అందిస్తుండడం విశేషం. ఈ సర్వీస్ లకు ‘లహరి, అమ్మ ఒడి’ అని పేరు పెట్టింది. తొలి విడతగా 16 బస్సులను సోమవారం ఎల్బీనగర్ లో మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ లు ప్రారంభించనున్నారు. విశాఖపట్నం, తిరుపతి, చెన్నై, బెంగళూరు, హుబ్లీ రూట్లలో నడపనున్నారు.

ఇటీవల 630 కొత్త సూపర్ లగ్జరీ బస్సులను, ఎనిమిది నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సులను, నాలుగు నాన్ ఏసీ స్లీపర్ బస్సులను ఆర్టీసీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ బస్సుల్లో ప్రయాణికుల భద్రత కోసం సీసీ కెమెరాలు, ఫైర్ డిటెక్షన్ అలారం సిస్టం, ట్రాకింగ్‌‌‌‌ సిస్టం, పానిక్‌‌‌‌ బటన్ సౌలత్​కల్పించారు. అలాగే వీటిని టీఎస్‌‌‌‌ఆర్టీసీ కంట్రోల్‌‌‌‌ రూమ్​కు కనెక్ట్ చేశారు.