చమురు ధరల ఎఫెక్ట్ : బస్సు ఛార్జీలను పెంచిన టీఎస్ ఆర్టీసీ

TSRTC hikes bus pass charges
TSRTC hikes bus pass charges

గత కొద్దీ రోజులుగా చమురు సంస్థలు పెట్రోల్ , డీజిల్ ధరలు భారీగా పెంచుతూ వస్తుండడం ఆ ఎఫెక్ట్ ప్రతిదీ దానిపై పడుతుంది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న టీఎస్ ఆర్టీసీ..ఇప్పుడు పెరుగుతున్న డీజిల్ ధరల కారణంగా మరింత నష్టాల్లోకి వెళ్లింది . ఈ నష్టాన్ని భర్తీ చేసేందుకు ప్రయాణికులపై భారం మోపక తప్పలేదు. డీజిల్‌ సెస్‌ ఛార్జీల పేరుతో బస్సు ఛార్జీలను పెంచుతున్నట్లు టీఎస్ ఆర్టీసీ శుక్రవారం ప్రకటించింది.

పల్లెవెలుగు, సిటీ, ఆర్డినరీ సర్వీసులకు డీజిల్ సెస్ కింద రూ. 2 చొప్పున, ఎక్స్ ప్రెస్ , డీలక్స్ , సూపర్ లగ్జరీ, సిటీ మెట్రో ఎక్స్ ప్రెస్, మెట్రో డీలక్స్, ఏసీ సర్వీసులకు రూ. 5 పెంచుతున్నట్టు తెలిపింది. బస్సు సర్వీసుల్లో కనీస టికెట్‌ ధరను రూ. 10 గా నిర్ణయించింది. పెరిగిన ఛార్జీలు శనివారం నుంచి అమల్లోకి రానున్నాయి.