ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్
ఇండిపెండెంట్ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి ఎలిమినేటెడ్
Hyderabad: ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇండిపెండెంట్ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి ఎలిమినేటెడ్ అయ్యారు. హర్షవర్ధన్ రెడ్డి రెండో ప్రాధాన్యత ఓట్లలో బీజేపీ ఆధిక్యంలో నిలిచింది. హర్షవర్ధన్ రెడ్డి ఓట్లలో బీజేపీకి 928ఓట్లు వచ్చాయి. వాణీదేవి ఓట్లు – 1,19,619, రామచంద్రరావు ఓట్లు – 1,10,500 గా ఉన్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి 9,119 ఓట్ల ఆధిక్యత కనబరుస్తున్నారు.
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/