మీ గురించి ఆలోచన చేస్తే పరిస్థితి ఏంటి?

ఏపీ మంత్రి కొడాలి నానిపై తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలు

Hyderabad: తెలంగాణలో పాలమూరు ప్రాజెక్టు పూర్తయితే బతుకులు బాగుపడతాయని ప్రజలు ఆశతో ఉన్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆ ఆశలకు పక్క రాష్ట్రం గండికొడుతోందని విమర్శించారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తికావాలని ప్రజలు ఆశతో ఉన్నారని.. జగన్ ప్రభుత్వం వరద జలాల పేరుతో నికర జలాలను తరలిస్తోందని అన్నారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును అక్రమంగా నిర్మిస్తున్నారని , కృష్ణా రివర్ బోర్డ్ రాయలసీమ ప్రాజెక్టును ఎందుకు ఆపడం లేదని ప్రశ్నించారు. హైడల్ ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి ఆపాలని మాకు ఎలా ఆదేశాలు ఇస్తారని మంత్రి ప్రశ్నించారు. ఏపీ మంత్రి కొడాలి నానిపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొడాలి నానికి హైదరాబాద్‌లో రెండు ఇళ్లు ఉన్నాయని, ఆయన ఇక్కడ వ్యాపారం చేస్తున్నారని అన్నారు. సి.రామచంద్రయ్య కూడా వైషమ్యాలు రెచ్చగొట్టేలా మాట్లాడొద్దని శ్రీనివాస్ గౌడ్ సూచించారు. ఇక్కడ తింటూ అక్కడి మాట మాట్లాడితే ఇక్కడి ప్రజలు మీ గురించి ఆలోచన చేస్తే పరిస్థితి ఏంటి? అని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. తమ పదవులు పోయినా, ప్రాణాలు పోయినా ఏపీ అక్రమంగా కడుతున్న ప్రాజెక్టును అడ్డుకుంటామని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/