నిజాం కాలేజీ విద్యార్థుల ఆందోళనపై స్పందించిన మంత్రి కెటిఆర్‌

minister-ktr

హైదరాబాద్ః మంత్రి కెటిఆర్‌ నిజాం కాలేజ్ విద్యార్థినుల ఆందోళనపై స్పందించారు. హాస్టల్ అలాట్మెంట్ సమస్యను పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని సమస్యను వెంటనే పరిష్కరించేలా చూడాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సూచిస్తూ ట్వీట్ చేశారు. తాను ఇచ్చిన మాట ప్రకారం హాస్టల్ నిర్మించి కాలేజీకి అందించిన తర్వాత వివాదం అవసరమా అని కెటిఆర్ ప్రశ్నించారు. ఈ సమస్యకు వెంటనే ముగింపు పలకాలని నిజాం కాలేజ్ ప్రిన్సిపాల్కు ఆదేశించారు. కెటిఆర్ ట్వీట్ పై మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. నిజాం కాలేజ్ విద్యార్థినుల హాస్టల్ సమస్యను స్వయంగా పర్యవేక్షించి సాధ్యమైనంత తొందరగా పరిష్కరిస్తానని కెటిఆర్ కు చెప్పారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/movies/