అంబేద్కర్‌ను ఓడించింది కాగ్రెస్‌ పార్టీ కాదా?

minister-ktr

హైదరాబాద్‌: అభివృద్ధి పనులు, మౌళిక వసతులపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ సంద‌ర్భంగా మంత్రి కెటిఆర్‌ మాట్లాడుతూ..భార‌త రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను కాంగ్రెస్ పార్టీ అవ‌మానించింది అని అన్నారు. త‌మ‌కు అంబేద్కర్ పై గౌర‌వం లేద‌ని భ‌ట్టి విక్ర‌మార్క మాట్లాడుతున్నారు. అది వారికే చెల్లుతుంద‌న్నారు. అంబేద్కర్‌ను అవ‌మానించింది కాంగ్రెస్ పార్టీనే. 1952లో జ‌రిగిన తొలి ఎన్నిక‌ల్లో అంబేద్కర్ ను ఓడించింది కాంగ్రెస్ పార్టీ కాదా? అని ప్ర‌శ్నించారు.

అంబేద్కర్‌ను పార్ల‌మెంట్‌లో అడుగుపెట్టనివ్వ‌కుండా కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసింద‌న్నారు. అంబేద్కర్‌కు భార‌త‌ర‌త్న ఇవ్వ‌ని కాంగ్రెస్ నేత‌లు.. ఆయ‌న గురించి మాట్లాడ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. అంబేద్కర్ ను గౌర‌విస్తున్నాం కాబ‌ట్టే.. బోర‌బండ‌లో సెంట‌ర్ ఫ‌ర్ ద‌ళిత్ స్ట‌డీస్ వ‌ద్ద దేశంలోనే అతి పెద్ద విగ్రహాన్ని 28 ఫీట్ల ఎత్తులో పెట్టాం. ట్యాంక్‌బండ్ వ‌ద్ద‌ 125 ఫీట్ల ఎత్తులో అంబేద్కర్ విగ్ర‌హాన్ని పెట్ట‌బోతున్నాం. అంబేద్కర్ ఆశ‌యాల‌ను అనుస‌రించి ఉంటే ఆ పార్టీ ఎప్పుడో బాగుప‌డేది. త‌మ పార్టీ అంబేద్కర్ ఆశ‌యాల‌కు అనుగుణంగా ముందుకెళ్తుందని కెటిఆర్ స్ప‌ష్టం చేశారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/