తెలంగాణ దేశానికి అన్నం పెట్టే ధాన్యాగారంగా మారిందిః హరీశ్ రావు

క్వింటాల్ వరి ధాన్యానికి రూ. 2,060గా నిర్ణయించాం.. హరీశ్ రావు

minister-harish-rao-

హైదరాబాద్ః నంగునూరు మండలం సిద్ధన్నపేట మార్కెట్ యార్డ్ లో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిధ్దిపేట జిల్లాలో 5 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. రైతులకు ఇబ్బందుల కలగకుండా కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లను పూర్తి చేశామని వెల్లడించారు. తెలంగాణ దేశానికి అన్నం పెట్టే ధాన్యాగారంగా మారిందని మంత్రి హరీశ్ రావు అన్నారు.

క్వింటాల్ వరి ధన్యానికి రూ. 2,060గా ధరను నిర్ణయించామని చెప్పారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన డబ్బులను రెండు రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తామని అన్నారు. ఎఫ్సీఐ నుంచి డబ్బులు రాకపోయినా తెలంగాణ ప్రభుత్వం వరిని కొనుగోలు చేస్తుందని చెప్పారు. పామ్ ఆయిల్ సాగుకు రైతులు ముందుకు రావాలని హరీష్ అన్నారు. ఈ పంట సాగు చాలా లాభదాయకంగా ఉంటుందని చెప్పారు. ఇదే సమయంలో బిజెపిపై హరీష్ రావు మండిపడ్డారు. వడ్లు కొనడం చేత కాకపోయినా… వందల కోట్లు పెట్టి ఎమ్మెల్యేలను బిజెపి కొంటోందని అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/