రూ.58 కోట్లు ఎలా మంజూరు చేస్తారు: హైకోర్టు

కోర్టు ధిక్కరణ కేసులకు రూ.కోట్ల నిధులివ్వడం పట్ల తెలంగాణ ప్రభుత్వం​ పై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ధిక్కరణ కేసుల కోసం విడుదల చేస్తున్న నిధులపై హైకోర్టు మండిపడింది. ప్రజాధనాన్ని ఎలా దుర్వినియోగం చేస్తారని నిలదీసింది. ఓ అధ్యాపకుడు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డిల ధర్మాసనం విచారించింది.

కోర్టు ధిక్కరణ కేసుల కోసం రూ.58 కోట్లు విడుదల చేశారని తెలిసి హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అన్ని కోట్లు ఎలా మంజూరు చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇందుకోసం ప్రజల సొమ్మును ఎలా ఖర్చు చేస్తారని, అందుకు ట్రెజరీ నిబంధనలు ఎలా అనుమతిస్తాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎస్ సోమేశ్ కుమార్ కు, రెవెన్యూ, ఆర్థికశాఖ కార్యదర్శులు, సీసీఎల్ఏ, ట్రెజరీ డైరెక్టర్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 27కి వాయిదా వేసింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/