కరీంనగర్‌ ఎన్నికపై హైకోర్టును కోరిన ప్రభుత్వం

లంచ్‌ మోషన్‌ దాఖలు చేసేందుకు కోర్టు అనుమతి

HIgh court of Telangana
HIgh court of Telangana

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరీంనగర్‌ కార్పొరేషన్‌ ఎన్నికపై హైకోర్టులో అప్పీలు చేసింది. కరీంనగర్‌ నగర పాలక సంస్థలో మూడు డివిజన్ల రిజర్వేషన్లపై సింగిల్‌ జడ్జి అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ నేపథ్యంలో సింగిల్‌ జడ్జి తీర్పును సవాల్‌ చేస్తూ లంచ్‌ మోషన్‌ దాఖలు చేసేందుకు హైకోర్టును అనుమతి కోరింది. దీనికి అంగీకరించిన ధర్మాసనం అత్యవసర వ్యాజ్యంగా తీసుకుని విచారణను చేపట్టింది. కరీంనగర్‌ మినహా రాష్ట్రంలోని 8 కార్పొరేషన్లకు ఎన్నిక సంఘం నోటిఫికేషన్‌ ఇచ్చింది. అయితే దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్‌ వేసింది. కరీంనగర్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ప్రక్రియ జరగాలని ప్రభుత్వం హైకోర్టును కోరింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/