నేడు ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇవ్వనున్న రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్: ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వనుంది. హైదరాబాద్‌ నగరంలోని ఎల్బీ స్టేడియంలో ఈ రోజున సాయంత్రం 6 గంటలకు ముస్లిం సోదరులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్‌ విందు ఇవ్వనుంది. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ కూడా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లోట్రాఫిక్‌ పోలీసులు ఆంక్షలు విధించారు.

శుక్ర వారం సాయంత్రం 5 గంటల నుంచి గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ రంగ నాథ్‌ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ఇఫ్తార్‌ విందులో ముస్లింలు, మత పెద్దలు భారీ సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉంది. దీంతో వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది రాకూడదనే.. హైదరాబాద్‌ లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/