తెల్లరేషన్కార్డు దారులకు..రూ. 1500 జమ
రాష్ట్రంలో అర్హులైన వారందరికీ 1500 పంపిణీ చేస్తున్నామన పౌరసరఫరాలసంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి
హైదరబాద్: కరోనా లాక్డౌన్ నేపథ్యంలో తెలంగాణలో సిఎం కెసిఆర్ తెల్లరేషన్కార్డు దారులకు ప్రకటించిన రెండో విడత రూ. 1500 నగదు బ్యాంకు ఖాతాల్లోకి జమ చేసే ప్రక్రియ మొదలైంది. శనివారం లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్టు పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అర్ములైన వారందరికీ 1500 పంపిణీ చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. 74.35 లక్షల మంది లబ్ధిదారులకు 1500 చొప్పున 1,115 కోట్లను శనివారం బ్యాంకుల్లో జమ చేశామని వివరించారు. బ్యాంకు ఖాతాలేని 5.38లక్షల మంది లబ్ధిదారులకు పోస్టాఫీసు ద్వారా రానున్న మూడు రోజుల్లో ఈ మొత్తాన్ని అందిస్తామని అన్నారు. కాగా ఇప్పటికే రెండో విడత బియ్యం పంపిణీలోనూ 9లక్షల మంది 37వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తీసుకున్నారని ఆయన తెలిపారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/