తెలంగాణ ఎంసెట్ దరఖాస్తుల గడువు తేదీ పొడిగింపు
జూలై 5 నుంచి 9 వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) మోడ్లో పరీక్షలు
Hyderabad: తెలంగాణ ఎంసెట్ -2021 దరఖాస్తుల గడువు తేదీని పొడిగిస్తున్నట్లు ఎంసెట్ కన్వీనర్ వెల్లడించారు. ఈ నెల 26 వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఎంసెట్ పరీక్షలు జూలై 5 నుంచి 9 వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) మోడ్లో జరుగుతాయని పేర్కొన్నారు.
ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలు, మళ్లీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్షలు మొత్తం 9 సెషన్లలో ఉంటాయన్నారు. అగ్రికల్చర్ కు 3, ఇంజినీరింగ్ కు 5 సెషన్లు, మరో సెషన్ను అవసరాన్ని బట్టి ఉంటుందన్నారు.
తాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/